
రాజకీయాలు

పద్మశ్రీ పురస్కార గ్రహీత, పర్యావరణ ఉద్యమకారుడు వనజీవి దరిపల్లి రామయ్య సేవలను స్మరించుకుంటూ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురిని సత్కరించారు. ఇప్పటికే రూపొందిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రాన్ని పాన్ ఇండియా స్థాయి ఫీచర్ ఫిల్మ్గా రూపొందించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ రామయ్య ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే యాత్ర చేపడతామని తెలిపారు. ఈ లఘుచిత్రం గద్దర్ అవార్డ్స్కు ఎంపిక కావడం విశేషం. దర్శకుడు వేముగంటి దర్శకత్వంలో బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పర్యావరణ అవగాహనను పెంపొందించేలా రూపొందినదని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!