
షోస్

నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తొలిసారిగా తమ కుమారుడు వాయువ్ తేజ్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. గత ఏడాది ఈ నెల 10న ఈ దంపతులకు కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. గతంలో తమ కుమారుడికి ‘వాయువ్ తేజ్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. వాయువ్ తొలి పుట్టినరోజు సందర్భంగా చిన్నారి ఫొటోను తొలిసారి అభిమానులతో పంచుకున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2017లో ‘మిస్టర్’ సినిమా కోసం తొలిసారి కలిసి నటించారు. ఆ సమయంలో మంచి స్నేహితులుగా మారిన వీరిద్దరూ అనంతరం ప్రేమలో పడ్డారు. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం తమ కుమారుడితో కలిసి కుటుంబ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!