

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఆగస్టు 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం, ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో థియేట్రికల్ హక్కులను విక్రయించింది. నైజాంలో ₹4 కోట్లు, సీడెడ్లో ₹1.50 కోట్లు, కోస్తా ఆంధ్రాలో ₹5 కోట్లు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో ₹10.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ₹12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బాక్సాఫీస్ వద్ద సుమారు ₹13.50 కోట్ల షేర్ వసూలు చేస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!