
జనరల్

విక్టరీ వెంకటేష్ మరోసారి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన కీలక ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు సమాచారం. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు భారీ వినోదాన్ని అందించేలా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనున్నారన్న వార్త ప్రాజెక్ట్పై ఆసక్తిని పెంచుతోంది.
జూన్ 15న హైదరాబాద్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం మూడో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!