
జనరల్

పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మాణ సంస్థ ‘పూరి కనెక్ట్స్’ నుంచి వస్తున్న ‘స్లమ్డాగ్-33’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా కనిపించనుండగా, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండటంతో అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో చేసిన క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “ప్రతి ఒక్కడు దొంగ బట్టేరా… మంచోడికి చోటు లేదురా” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఇది వ్యక్తిగత సమస్యల కారణమా లేదా ఫైనాన్షియల్ వివాదాల ప్రభావమా అనే చర్చలు జరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!