
రాజకీయాలు

ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 సినిమా ప్రచార కార్యక్రమాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాలనటి యువినా పార్థవిని 'సంపూర్ణ' పాత్రలో పరిచయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. వీడియోలో తండ్రి పాత్రలో కనిపించే వెంకటేశ్కు "నాన్న.. నేనో అబ్బాయిని ప్రేమించేశా" అని సంపూర్ణ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కుటుంబ కథా చిత్రంలో వెంకటేశ్ చిట్టిబాబు పాత్రలో నటిస్తుండగా, ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి కనిపించనున్నారు. విడుదలకు ముందు ఒక్కో పాత్రను ప్రత్యేక వీడియోల ద్వారా పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను అలరించే ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!