

కళ్యాణ్ పడాల, వియానా జంటగా నటించిన మినీ మూవీ ‘నిజమే విలువైనది’ ప్రస్తుతం తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. కె. ప్రకాశ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జయమ్మ రెడ్డి నిర్మించారు. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు.
షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాక్టెయిల్ 2’ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హోమి అడజానియా దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.
మరోవైపు, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘భారత్ భాగ్య విధాత’ జీ5లో అందుబాటులోకి వచ్చింది. మనోజ్ తపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలైంది.
జగపతిబాబు కథానాయకుడిగా నటించిన ‘వదలా’ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ కథానాయికలుగా నటించారు. కుటుంబ భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!