
బిజినెస్

వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' జూన్ 5, 2026న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జీ5 ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, జూలై 31 నుంచి హిందీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టిప్స్ ఫిల్మ్స్ బ్యానర్పై రమేష్ తౌరానీ నిర్మించారు. మనీష్ పాల్, చంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!