
క్రీడలు

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. ఇటీవల శాసనసభలో ఈ మేరకు తీర్మానం చేయగా.. అనంతరం దాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. తీర్మానాన్ని పరిశీలించిన మండలి చైర్మన్.. తదుపరి పరిశీలన, చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించారు.
ప్రజాజీవితంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శాసనసభలో చేసిన తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా సభ తీర్మానించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎథిక్స్ కమిటీ పరిశీలనకు వెళ్లడంతో.. కమిటీ సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!