
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది.
ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. యువత గొంతును అణచివేయడం సాధ్యం కాదని, విద్యార్థుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నీట్ వ్యవహారంలో పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!