
ఓటీటీ

హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్రం నిధులు విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి వల్లే కేంద్ర నిధులు నిలిచిపోయాయని, అభివృద్ధికి ఆయన అడ్డుపడుతున్నారని విమర్శించారు.
మెట్రో విస్తరణకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలా వద్దా అన్నది కేంద్రం స్పష్టంగా చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. రాజకీయాలను అభివృద్ధితో ముడిపెట్టవద్దని సూచించారు. నిధుల విడుదలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, సాయంత్రం వరకు నిధులపై స్పష్టత ఇవ్వాలంటూ కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!