
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కావేరి జలాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర నీటి హక్కులను పరిరక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, కావేరి నదిపై ప్రతిపాదిత మేకేదాటు డ్యామ్కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు అమలైతే తమిళనాడుకు లభించే నీటి ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కావేరి జలాల పంపిణీ విషయంలో ఇప్పటికే సున్నితమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సీఎం విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు రైతుల ప్రయోజనాలు, సాగునీటి అవసరాలు, తాగునీటి భద్రతకు ఎలాంటి నష్టం కలగకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన ప్రధాని మోదీని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!