

తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత వివాదాల పరిష్కారానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖ–ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిశీలించేందుకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను పరిశీలకుడిగా నియమించారు. అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో మండల కమిటీల నియామకానికి సంబంధించిన వివాదాన్ని పరిశీలించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని నియమించారు.
ఈ రెండు అంశాలపై సమగ్రంగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని సచిన్ సావంత్, జగ్గారెడ్డికి పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల అభివృద్ధి అంశంలో తనను పక్కనపెట్టి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారని మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తుంగతుర్తిలో మండల కమిటీల నియామకంపై రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలపై కూడా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!