

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం బోయపాడు, దొండవాక తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. గత రెండేళ్లలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.600 కోట్లు వెచ్చించామని, మౌలిక వసతులు మరియు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతిపాదించిన మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో రెండింటిని పాయకరావుపేటకు తీసుకురావడం ద్వారా సుమారు 9 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అనిత పేర్కొన్నారు. మత్స్యకార గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు బీసీ బాలికల సంక్షేమ హాస్టల్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!