

సివిల్ సర్వీసెస్ అభ్యర్థిగా ఉన్న సమయంలో రూ.500 లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి రాహుల్ బన్సాల్పై ఇప్పుడు రూ.కోటి లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సుర్గుజా జిల్లాలో సీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో సైబర్ నేరానికి సంబంధించిన సెటిల్మెంట్ కోసం ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. రెండు దఫాలుగా డబ్బు బదిలీ చేసినట్లు పేర్కొంటూ వాట్సాప్ చాట్స్, ఇతర డిజిటల్ ఆధారాలను సమర్పించినట్లు సమాచారం.
ఈ వ్యవహారం దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి చేరగా, ఘటనపై నివేదిక సమర్పించాలని ఛత్తీస్గఢ్ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, సివిల్ సర్వీసెస్లో చేరకముందు రాహుల్ బన్సాల్ ఇచ్చిన ఓ మాక్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అందులో తన సోదరుడి జనన ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ అధికారి రూ.500 లంచం అడిగారని, ఆ మొత్తం చెల్లించడం బాధ కలిగించిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అవినీతిపై అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత ఆరోపణలతో పోల్చుతూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!