
జనరల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం రేవంత్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. మెట్రో ఫేజ్-2 సాధనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో సీఎం లేరని, అందుకే ప్రతిపక్షాలపై నిందలు మోపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదని, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాల్లో ప్రభుత్వం ఫలితాలు సాధించడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!