

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా ఉంటే ఎల్పీ సమావేశాలను కూడా ఫామ్హౌస్లోనే నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్లకు ప్రజా సమస్యలు పట్టడం లేదని, కేవలం రాజకీయ రాద్ధాంతంపైనే దృష్టి పెట్టాయని విమర్శించారు. చట్టాలు చేసే పవిత్ర దేవాలయం అసెంబ్లీ అని పేర్కొన్న ఆమె.. సమావేశాలకు హాజరుకాకుండా బయట నిరసనలు చేయడం ఎందుకని బీఆర్ఎస్ను ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీజేపీ నిరసనలకు దిగడంపైనా సీతక్క మండిపడ్డారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో నిర్మాణాత్మక ప్రతిపక్షం లేదని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్లు డ్రామా కంపెనీలుగా మారాయని, ఒకరు అసెంబ్లీ బయట, మరొకరు లోపల రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విధించిన నియమాలను ఇప్పుడు వారే ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ.. రాజకీయ డ్రామాలు ఆపి అసెంబ్లీకి రావాలని ప్రతిపక్షాలకు సీతక్క సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!