
రాజకీయాలు

కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు ఫోన్ చేసి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ అంశంపై బీజేపీ, జేడీఎస్ నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. చైర్మన్ను పార్టీ కాదు, సభే ఎన్నుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
తన పదవీకాలం 2028 వరకు ఉందని, సభా నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే మాత్రమే తనను తొలగించగలరని హొరట్టి స్పష్టం చేశారు. కనీసం 10 మంది సభ్యులు 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సలీం అహ్మద్ పేరును చైర్మన్ పదవికి పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!