

2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును విజయంగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా స్వీకరించి పాలన ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండేళ్ల పాలనలో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని దామినీడులో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభలో సీఎం పాల్గొని ప్రభుత్వ పనితీరును వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని, శాంతిభద్రతలు, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవా దృక్పథంతో పాలన కొనసాగిస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!