

బిగ్బాస్ తెలుగు సీజన్ 10 ఈసారి ‘దశావతారం’ అనే వినూత్న థీమ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్స్, ఆసక్తికరమైన ట్విస్టులతో షో ఫార్మాట్ను రీవ్యాంప్ చేసినట్లు సమాచారం. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్న ఈ సీజన్లో ‘అగ్ని పరీక్ష’ డిజిటల్ షో ద్వారా ఎంపికైన నలుగురు సామాన్యులు హౌస్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తొలి మహిళా కంటెస్టెంట్గా జానపద గాయని ఝాన్సీ పేరు వినిపిస్తోంది.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ రైతు కుటుంబం నుంచి వచ్చారు. పొలం పనులతో పాటు జానపద పాటలు పాడుతూ, వాటిని ఆన్లైన్లో పంచుకోవడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అగ్ని పరీక్ష’లో తన ప్రతిభ, తెలివితేటలు, కష్టపడే తత్వంతో ఆకట్టుకుని ఎంపికైనట్లు సమాచారం. బిగ్బాస్ హౌస్లో ఆమె ఎలాంటి ఆటతీరును ప్రదర్శిస్తారో, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!