

బిగ్బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో 16వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ఈ ఎపిసోడ్లో గాయత్రి ఎలిమినేట్ అయ్యారు. తొలుత రోహిత్, రామకృష్ణ, అపూర్వ, గాయత్రి డేంజర్ జోన్లో ఉండగా, వారిలో కొందరికి టాస్క్ల ద్వారా బయటపడే అవకాశం లభించింది. రోహిత్, రామకృష్ణ టాస్క్లో పోటీ పడగా, రోహిత్ తన టెక్నిక్తో విజయం సాధించి డేంజర్ జోన్ నుంచి బయటపడ్డారు. అనంతరం ప్రియాంక, అపూర్వ కూడా తమకు ఇచ్చిన టాస్క్లలో ప్రతిభ చూపించి సేఫ్ అయ్యారు. చివరికి రామకృష్ణ, గాయత్రి మాత్రమే మిగలడంతో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలనే నిర్ణయాన్ని జ్యూరీ కంటెస్టెంట్లకే అప్పగించింది. మెజార్టీ ఓట్లతో గాయత్రి ఎలిమినేట్ అయ్యారు.
మరోవైపు గెస్ట్గా వచ్చిన అమర్దీప్ ప్రత్యేకమైన వైల్డ్ ఫైర్ కార్డ్ను తీసుకొచ్చారు. ఇది సాధారణ ఫైర్ కార్డ్ కంటే మరింత శక్తివంతమైనదని, ఎప్పుడైనా ఏ కంటెస్టెంట్పైనైనా ఉపయోగించవచ్చని ఆయన వివరించారు. దీంతో షోలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎలిమినేషన్ అనంతరం గాయత్రి మాట్లాడుతూ తాను ఎవరితోనూ ఫేక్గా ఉండలేదని, తనలాగే ఉన్నానని తెలిపారు. ఆట కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదని, సింపతీ కోసం ఏడ్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. ప్రస్తుతం అగ్నిపరీక్షలో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా, రాబోయే ఎపిసోడ్లలో మరిన్ని ఎలిమినేషన్లు, ఆసక్తికరమైన మలుపులు చోటుచేసుకునే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!