

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027పై ఇప్పటినుంచే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఎక్కువ భాగం కీలక మ్యాచ్లు దక్షిణాఫ్రికాలోనే జరిగే అవకాశముండటంతో అందరి దృష్టి అక్కడి మైదానాలపైనే ఉంది.
ఈ నేపథ్యంలో టీమిండియా లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్లు ఏ వేదికలో ఆడనుందనే అంశం చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ కింగ్స్మీడ్ మరియు సెంచూరియన్ సూపర్స్పోర్ట్ పార్క్ ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. డర్బన్లో భారత అభిమానులు అధికంగా ఉండగా, సెంచూరియన్ ప్రయాణ సౌకర్యాలు, నిర్వహణ పరంగా మెరుగైన వేదికగా గుర్తింపు పొందింది.
వర్షం ప్రభావం కూడా వేదిక ఎంపికలో కీలక అంశంగా మారింది. సెంచూరియన్లో వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగే అవకాశం సుమారు 5 శాతం మాత్రమే ఉండగా, డర్బన్లో అది 12.76 శాతంగా ఉంది. అంతేకాదు, సెంచూరియన్లోని ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ వల్ల వర్షం ఆగిన వెంటనే మ్యాచ్ను తిరిగి ప్రారంభించే వీలుంటుంది.
జోహన్నెస్బర్గ్, కేప్టౌన్లలో ఒకటి లేదా రెండు కీలక మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, టీమిండియా లీగ్ దశలో మూడు నుంచి నాలుగు మ్యాచ్లు సెంచూరియన్లోనే ఆడే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. అక్కడ భారత జట్టు రికార్డు కూడా మెరుగ్గా ఉండటంతో 2027 వరల్డ్ కప్లో సెంచూరియన్ టీమిండియాకు హోమ్ గ్రౌండ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!