

మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ చేతిలో శ్రీలంక ఓటమి పాలైన తర్వాత జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, తన 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత విజయాలు సాధించినప్పటికీ, కెప్టెన్గా జట్టును ఒక్కసారి కూడా ప్రపంచకప్ సెమీఫైనల్కు తీసుకెళ్లలేకపోవడం తనకు అతిపెద్ద బాధగా మిగిలిపోయిందని తెలిపారు. ఒక కెప్టెన్గా తాను విఫలమయ్యాననే భావన తనను ఎప్పటికీ వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెస్టిండీస్తో మ్యాచ్లో శ్రీలంక కేవలం 98 పరుగులకే ఆలౌట్ కావడం, తాను కూడా కీలక సమయంలో విఫలమవడం బాధాకరమని చమరి అంగీకరించారు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొంటూ, మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిందని అన్నారు. 36 ఏళ్ల చమరి తన భవిష్యత్తుపై కూడా సందిగ్ధత వ్యక్తం చేశారు. 2028 టీ20 ప్రపంచకప్ వరకు ఆడాలా వద్దా అనే విషయాన్ని తన ఫిట్నెస్, ఫామ్, అలాగే జట్టు అవసరాలను బట్టి నిర్ణయిస్తానని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!