

పోర్చుగల్ మరియు కాంగో జట్ల మధ్య జరిగిన ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-కె మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్లో అడుగుపెట్టిన కాంగో తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మ్యాచ్ ప్రారంభమైన ఆరో నిమిషంలోనే పోర్చుగల్ మిడ్ఫీల్డర్ జోవో నెవ్స్ గోల్ సాధించి తన జట్టుకు ఆధిక్యం అందించాడు. అయితే తొలి అర్ధభాగం అదనపు సమయంలో కాంగో స్టార్ ఆటగాడు విస్సా హెడర్ ద్వారా గోల్ చేసి స్కోరును సమం చేశాడు.
రెండో అర్ధభాగంలో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడినా మరో గోల్ నమోదు కాలేదు. 70 శాతానికి పైగా బంతిని నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ పోర్చుగల్ ఆధిక్యాన్ని విజయంగా మార్చుకోలేకపోయింది. మ్యాచ్లో నలుగురు ఆటగాళ్లకు ఎల్లో కార్డులు ఇవ్వగా, అందులో ముగ్గురు పోర్చుగల్ జట్టుకే చెందినవారు. మరోవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మాత్రం నిరాశపరిచాడు. కేవలం రెండు షాట్లు మాత్రమే ప్రయత్నించిన రొనాల్డో మ్యాచ్పై ప్రభావం చూపలేకపోయాడు. దీంతో కాంగో చారిత్రాత్మకంగా విలువైన ఒక్క పాయింట్ను ఖాతాలో వేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!