
జనరల్

టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన అభిమానిపై చూపిన అభిమానంతో మరోసారి అందరి మనసులు గెలుచుకున్నాడు. తన అభిమాన క్రికెటర్ను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 1,800 కిలోమీటర్లకు పైగా సైకిల్పై ప్రయాణించి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న హార్దిక్, తన బిజీ షెడ్యూల్ మధ్యలో సమయం కేటాయించి అతనిని స్వయంగా కలిశాడు.
అభిమానితో దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడిన హార్దిక్, అతని అంకితభావాన్ని అభినందిస్తూ రూ.1.5 లక్షలు బహుమతిగా అందించాడు. ఈ హృదయాన్ని హత్తుకునే ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారగా, హార్దిక్ వినయం, ఉదారతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!