

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇకపై తెలుగు బ్లాక్ హాక్స్గా కొత్త రూపంలో కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వాలీబాల్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఈ క్రీడ ద్వారా మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఫ్రాంచైజీ ఈ మార్పును ప్రకటించింది. హైదరాబాద్ తమ జట్టుకు ఎప్పటికీ సొంతగడ్డగానే ఉంటుందని, అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ అభివృద్ధికి మరింత కృషి చేయనున్నట్లు తెలిపింది. గత నాలుగేళ్లుగా పలు టోర్నమెంట్లు, క్లినిక్లు, ఓపెన్ ట్రయల్స్, క్యాంపులు, గ్రాస్రూట్ కార్యక్రమాల ద్వారా వాలీబాల్ను ప్రోత్సహించింది.
ఇక పీవీఎల్ 2026 సీజన్ కోసం తెలుగు బ్లాక్ హాక్స్ తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. అహ్మదాబాద్లో జరగనున్న సీజన్ 5 కోసం గోవాలో నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో తానిష్ చౌదరిని రూ.14 లక్షలకు, వినీత్ కుమార్ను రూ.8 లక్షలకు, మౌహ్సిన్ పీఏను రూ.5 లక్షలకు, హరి ప్రసాద్ బీఎస్, దీపక్లను చెరో రూ.3 లక్షలకు కొనుగోలు చేసింది. రైట్ టు మ్యాచ్ ద్వారా న్యాస్ అబ్దుల్ సలామ్ను రూ.4 లక్షలకు కొనసాగించింది. మిగిలిన జట్టులో వరంగల్కు చెందిన మెట్టు సిరిల్ రెడ్డి, నమిత్ ఎంఎన్, శిఖర్ సింగ్, జాన్ జోసెఫ్, దీపు వెంకుగోపాల్, ప్రీత్ కరణ్ ఉన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!