
షోస్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యాహ్నం 3.45 గంటలకు తీర్పును వెల్లడించనుంది. దానం నాగేందర్పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ తీర్పుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
దానం నాగేందర్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్ గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. రేపు వెలువడనున్న తీర్పుతో ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!