

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ చేరలేకపోయిన నిరాశ మధ్య భారత మహిళల క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారత మహిళల జట్టు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైనప్పటికీ, ఆసియా జట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో భారత్కు ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది. 128 ఏళ్ల విరామం తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్కు మళ్లీ చోటు లభించనున్న నేపథ్యంలో ఈ అర్హత మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఐసీసీ ప్రకటించిన అర్హత నిబంధనల ప్రకారం మహిళల టీ20 విభాగంలో మొత్తం ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఇప్పటికే ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి గ్రేట్ బ్రిటన్ అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి ఆతిథ్య దేశమైన అమెరికా ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-15లోకి వస్తే లభిస్తుంది. చివరి స్థానం 2027లో జరిగే ఐసీసీ ఒలింపిక్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయించబడుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!