

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భాగంగా థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సుజీ బేట్స్ 10,740 పరుగుల రికార్డును అధిగమించిన మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంధాన ఖాతాలో 10,750 పరుగులు ఉండగా, భారత దిగ్గజం మిథాలీ రాజ్ 10,868 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు.
మరోవైపు థాయ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంధాన 19 పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరిగారు. గాయంతో జెమీమా రోడ్రిగ్స్ దూరం కావడంతో ప్రతికా రావల్కు తుదిజట్టులో అవకాశం లభించింది. దీంతో ఆమె భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. మ్యాచ్కు ముందు మహిళల ఆసియా కప్ 2026లో భారత్ తన తొలి మ్యాచ్ను థాయ్లాండ్తో ఆడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!