

ఫిట్నెస్కు మారుపేరుగా నిలిచిన విరాట్ కోహ్లీ.. తన ఫీల్డింగ్ తీవ్రతతోనూ సహచర ఆటగాళ్లపై ప్రభావం చూపాడని భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపారు. మైదానంలో దూకుడు విషయంలో కోహ్లీ ఎప్పుడూ రాజీపడడని, కవర్స్, షార్ట్ మిడ్వికెట్ వంటి స్థానాల్లో ఫీల్డింగ్ చేసేటప్పుడు అతడి వేగం, చురుకుదనం ప్రత్యేకంగా కనిపిస్తాయని చెప్పారు. కోహ్లీ ఫీల్డింగ్ విధానం జట్టులో కనీసం ఐదుగురిని తన బాటలో నడిచేలా చేసిందని దిలీప్ పేర్కొన్నారు.
ప్రాక్టీస్ అయినా, మ్యాచ్ అయినా కోహ్లీ ఒకే స్థాయి తీవ్రతతో ఉంటాడని దిలీప్ తెలిపారు. బంతి తనకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా దూరంగా ఉన్నా దాన్ని అందుకునేందుకు ప్రయత్నించడం అతడి ప్రత్యేకత అని చెప్పారు. కెరీర్ చివరి దశలోనూ బంతిని ఆపేందుకు లాంగ్ఆన్ నుంచి లాంగ్ఆఫ్ వరకు వేగంగా పరుగెత్తే కోహ్లీ తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని వివరించారు. పవర్ప్లే తర్వాత బౌండరీ లైన్ వద్దకు కూడా ఇతరులకంటే ముందే చేరుకుంటాడని అన్నారు. భారత జట్టుతో ఐదేళ్లు ఫీల్డింగ్ కోచ్గా పనిచేసిన దిలీప్.. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్తో తన పదవీకాలాన్ని ముగించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!