

మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్, ప్రతిపాదిత ‘యూజర్నేమ్’ ఫీచర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు తన వివరణను సమర్పించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, వాట్సాప్ అందించిన వివరణను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. అయితే, గురువారం ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ఈ వివరణపై మెటా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇటీవల ప్రకటించిన ‘యూజర్నేమ్’ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్ను ఇతరులతో పంచుకోకుండా వాట్సాప్లో కనెక్ట్ అయ్యే అవకాశం కల్పించనుంది. రాబోయే నెలల్లో ఈ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి వినియోగదారుడు ప్రత్యేకమైన యూనిక్ యూజర్నేమ్ను రిజర్వ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించనున్నట్లు వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!