

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో నితీశ్ తివారీ దర్శకత్వంలోని 'రామాయణం' ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, ఈ చిత్రం భారతీయ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను నిర్మాత కరణ్ జోహార్ రూ.350 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా దాదాపు 30 నిమిషాల ఫుటేజ్ను కరణ్ జోహార్కు చూపించిన అనంతరం ఈ ఒప్పందం కుదిరిందని టాక్ వినిపిస్తోంది. తొలుత రూ.500 కోట్లతో చర్చలు ప్రారంభమైనప్పటికీ చివరకు రూ.350 కోట్ల వద్ద డీల్ ముగిసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలు, స్టార్ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించే సామర్థ్యం ఈ చిత్రానికి ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!