
జనరల్

అమెరికాకు చెందిన ప్రధాన టెక్నాలజీ కంపెనీల షేర్లలో గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. టెస్లా, మెటా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్విడియా తదితర దిగ్గజాల మార్కెట్ విలువలు కలిపి సుమారు రూ.114 లక్షల కోట్లు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లలో ఆందోళన నెలకొంది.
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోకపోవడం, భవిష్యత్ మూలధన వ్యయాలపై స్పష్టత లేకపోవడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే త్రైమాసిక ఫలితాలు, AI పెట్టుబడుల వ్యూహాలపై ఇన్వెస్టర్లు ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!