

ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా బెంగళూరులో ఆగస్టు 15కు ముందే ఈ సేవలను ప్రారంభించేందుకు సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రెస్టారెంట్ల ఆన్బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంస్థలు 16 నుంచి 30 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్కార్ట్ మాత్రం 10 శాతం కమీషన్తో రెస్టారెంట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
మొదట బెంగళూరులో ప్రయోగాత్మకంగా సేవలను ప్రారంభించి, తరువాత దేశవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉంది. ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ కృష్ణమూర్తి ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రణాళికలు వేగం పుంజుకున్నాయి. ఫ్లిప్కార్ట్ తన ప్రధాన యాప్తో పాటు ప్రత్యేక ఫుడ్ డెలివరీ యాప్ను కూడా ప్రారంభించనుంది. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ ఆధిపత్యం కొనసాగుతుండగా, రాపిడో కూడా రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ ప్రవేశంతో పోటీ మరింత తీవ్రం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!