
జనరల్

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ భారత్ మార్కెట్లో కొత్త నార్డ్ బడ్స్ 4 ఇయర్ఫోన్స్ను విడుదల చేసింది. నార్డ్ బడ్స్ 4 ప్రో తర్వాత వచ్చిన ఈ మోడల్లో 52 డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 54 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఏఐ ట్రాన్స్లేషన్, గేమింగ్ స్పేషియల్ ఆడియో వంటి ఆధునిక ఫీచర్లు జోడించారు.
ఈ ఇయర్ఫోన్స్లో 12 ఎంఎం టైటానియం కోటెడ్ డ్రైవర్లు, ఐపీ 55 రేటింగ్, బ్లూటూత్ 6.1, ఆరు మైక్రోఫోన్లతో క్లియర్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. గత జనరేషన్తో పోలిస్తే 200 శాతం మెరుగైన ఏఎన్సీ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ధరను రూ.3,299గా నిర్ణయించగా, లాంచ్ ఆఫర్లో రూ.3,099కి అందుబాటులో ఉన్నాయి. జూన్ 29 నుంచి కొనుగోలు చేయవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!