

పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలు, ఆశించిన స్థాయిలో పెరగని ఆదాయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూలు) వాటాల విక్రయాన్ని వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ.24,923 కోట్లు సమీకరించి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యధిక తొలి త్రైమాసిక పెట్టుబడుల ఉపసంహరణగా నిలిచింది.
గత ఆరు వారాల్లో ఆరు పీఎస్యూల్లో నిర్వహించిన ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ.18,561 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (InvITs) ద్వారా రూ.6,367 కోట్లు సమీకరించింది. మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన రావడంతో ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంక్ సహా మరిన్ని పీఎస్యూల్లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమవుతోంది.
ముడి చమురు ధరల పెరుగుదల, ఎరువుల సబ్సిడీ భారం, పన్ను వసూళ్ల మందగమనం వంటి కారణాలతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో రూ.80,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కూడా మించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ద్రవ్యలోటును నియంత్రించేందుకు ఇదే ప్రధాన మార్గమని అధికారులు అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!