

విశాఖపట్నం జిల్లా భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్లో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో 10 మంది తొమ్మిదో తరగతి బాలికల జడలు కత్తిరించినట్లు సమాచారం. ఒక గదిలో నిద్రిస్తున్న ఆరుగురు, మరో గదిలో ఉన్న నలుగురు బాలికల జడలు కత్తిరించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున నిద్రలేచిన విద్యార్థినులు విషయాన్ని గుర్తించి పాఠశాల ప్రిన్సిపాల్కు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదని అధికారులు తెలిపినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు, విద్యాశాఖ, బాలల సంక్షేమ అధికారులు విచారణ చేపట్టారు. రాత్రి సమయంలో విద్యార్థినులు నిద్రిస్తున్న ప్రాంగణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారు? భద్రత, పర్యవేక్షణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేజీబీవీని సందర్శించి ప్రిన్సిపాల్ నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు, బాలల హక్కుల కమిటీ కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!