
క్రీడలు

వరంగల్లోని ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించిందని ఓ వినియోగదారు ఫిర్యాదు చేయడంతో ఆహార భద్రత అధికారులు సంబంధిత పెరుగు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై వచ్చిన వార్తల నేపథ్యంలో సంగం డెయిరీ యాజమాన్యం స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సంస్థలో పాలు సేకరణ నుంచి ప్యాకింగ్ వరకు అత్యాధునిక స్వయంచాలక వడపోత విధానాలు అమలులో ఉన్నాయని, తమ డెయిరీ అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేస్తోందని సంస్థ తెలిపింది. ఉత్పత్తుల తయారీ సమయంలో ప్యాకెట్లోకి ఎలుక చేరడం అసాధ్యమని పేర్కొంది. వినియోగదారుడి వద్దే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అభిప్రాయపడింది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నామని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!