
బిజినెస్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. దేశ ఆర్థిక ప్రగతి, రాష్ట్రాల ఆర్థిక అంశాలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై సమావేశంలో చర్చించనున్నారు.
‘వికసిత్ భారత్’ లక్ష్యంగా దేశ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన విధానాలు, ప్రాధాన్యతలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చర్చకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!