
జనరల్

అస్సాంలో వరదల పరిస్థితి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదుల నీటిమట్టం పెరగడంతో ఆరు జిల్లాల్లోని 99 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా లఖింపూర్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమై, వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రమాద ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!