
జనరల్

ఆర్జేడీ అధికార ప్రతినిధి ప్రియాంక భారతి ఎక్స్లో చేసిన ఒక పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత నాయకుల విద్యార్హతలను పోలుస్తూ ఆమె, "హార్వర్డ్లో చదివిన నాయకుడిని 'పప్పు' అంటారు.. నాలుగో తరగతి ఫెయిల్ అయిన వ్యక్తిని 'విశ్వగురు' అంటారు" అని పోస్టు చేశారు. ఎవరిపేరూ ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీలను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
ఈ పోస్టు వైరల్ కావడంతో బీజేపీ, ప్రతిపక్ష వర్గాల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. బీజేపీ మద్దతుదారులు దీనిని అవమానకర వ్యాఖ్యగా విమర్శించగా, ప్రతిపక్ష వర్గాలు రాజకీయ వ్యాఖ్యగా సమర్థించాయి. ఈ ఘటనతో రాజకీయ నాయకత్వం, విద్యార్హతలు, ప్రజాభిప్రాయంపై మరోసారి చర్చ మొదలైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!