
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ఫ్యూచర్ సిటీకి చేరుకోనున్న ఆయన, అక్కడ అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతులు, పెట్టుబడులకు మరింత ఊతమివ్వనుంది.
అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు. తర్వాత మధ్యాహ్నం 3:00 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!