

ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యువతకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విజయంతో పాటు సమాజ ప్రగతి, దేశాభివృద్ధికి కూడా స్కిల్స్ బలమైన పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
యువతకు అత్యాధునిక నైపుణ్యాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోందని, ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణమని పేర్కొంటూ, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని యువతకు సూచించారు. నైపుణ్యమే ఆత్మవిశ్వాసానికి, ఉపాధికి, సుస్థిర భవిష్యత్తుకు మార్గమని ఆయన స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!