
క్రీడలు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులను నిన్న పరిశీలించారు. రాజధానిలో జరిగిన తన సినిమా ప్రారంభోత్సవం అనంతరం ఆయన నిర్మాణ స్థలాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ కార్మికులు మరియు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్లో ఇప్పటికే విస్తరణ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
అమరావతిలో కూడా అదే తరహాలో నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. జూలైలో పుట్టింగ్ పనులు ప్రారంభమవుతాయని, 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!