
రాజకీయాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్పోర్టును ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
భోగాపురం ఎయిర్పోర్టుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని తెలిపారు. విమానాశ్రయం, పర్యాటక ప్రాజెక్టులు, పోర్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమల అభివృద్ధితో ఉత్తరాంధ్ర కొత్త అవకాశాల దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్ర సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఎయిర్పోర్టు అభివృద్ధి ఉండాలని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!