

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందించిన తొలి తెలుగు చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు పురస్కారాలను సొంతం చేసుకుని ఘనత సాధించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంతో పాటు, మేకప్ విభాగంలో పి. రవికుమార్ అవార్డు అందుకున్నారు.
ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డుల్లో గుర్తింపు పొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్, గామా 2025, సైమా 2025, ఫిల్మ్ఫేర్ అవార్డుల్లోనూ విజయాలు అందుకుంది. ఈ సినిమాలో 16 మంది కొత్త నటీనటులను పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.9 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.18.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి మొత్తం రూ.24.5 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. తాజాగా జాతీయ అవార్డులు దక్కడం చిత్రబృందానికి మరింత గర్వకారణంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!