

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన యూత్ డిక్లరేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, విద్యార్థినులకు స్కూటీలు, విద్యా భరోసా వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో “కొలువుల కుంభమేళా” పేరుతో “కుంభకోణాల కుంభమేళా” జరుగుతోందని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగులపై దాడులు, అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకపోతే యువత, ప్రజలు భవిష్యత్తులో ఆ పార్టీని ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!