
రాజకీయాలు

మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సతీమణి చెన్నమ్మ దేవెగౌడ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించగా, శనివారం గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. చెన్నమ్మ దేవెగౌడ మృతి చెందడంతో దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
జూలై 15న అనారోగ్య కారణాలతో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రిలో ఆమె చేరారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!