
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 వేరియంట్ గుర్తించారు. కడప జిల్లాలో నమోదైన నాలుగు నమూనాలను పూణే వైరాలజీ ల్యాబ్కు పంపగా ఈ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఆర్ఎఫ్.5 ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన ఉపవంశమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో ఉందని తెలిపారు. ఇది ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ప్రమాదకరం కాదని స్పష్టం చేశారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో ఆసుపత్రులు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయని, ఇప్పటివరకు 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!