
షోస్

కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు 23 రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు కూడా వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వారి బోటు ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ తీరానికి చేరినట్లు గుర్తించారు.
మత్స్యకారుల ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 23 రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలకు తెరపడటంతో కుటుంబాల్లో ఆందోళన తొలగి, సంతోషం నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!